బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టాపార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్ ఐపీఎల్కు అందుబాటులో ఉండటం లేదని ఆర్సీబీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గతేడాది ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-1లో వేగవంతమైన సెంచరీతో విజృంభించాడు. వాస్తవానికి ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడనుకున్న రజత్ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలిసింది.