న్యూఢిల్లీ: ఐపీల్లో ఒక్కసారికూడా టైటిల్ గెలవకున్నా అదే స్ఫూర్తితో ఆడుతున్నానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.
బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో మాటామంతి సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ ఈ లీగ్లో ప్రెజర్(ఒత్తిడి) అనేది ఉండకూడదని, కేవలం ప్లెజర్(ఉల్లాసం)గా ఉండాలని సూచించాడు. ఆటలో ఎత్తుపల్లాలు సహజమని, మన శక్తి మేరకు ప్రదర్శన చేయాలని వారిలో స్ఫూర్తిని నింపాడు.