ముంబై: ఐపీఎల్లో సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ సంఘటన చోటుచేసుకున్నది. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. రోహిత్ శర్మ(Rohit Sharma) అభిమాని ఒకడు మైదానంలోకి దూసుకువచ్చాడు. ఆ కుర్రాడు రోహిత్ను హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో రోహిత్ ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లేందుకు ట్రై చేశాడు. ఆ అభిమాని దగ్గరకు రావడం చూసిన రోహిత్ భయంతో దూరం వెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరకు రోహిత్కు షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ ఫ్యాన్.. ఆ తర్వాత అక్కడే ఉన్న కీపర్ను కూడా హత్తుకున్నాడు. తర్వాత సెక్యూర్టీ వచ్చి ఆ అభిమానని స్టేడియం నుంచి బయటకు తీసుకువెళ్లింది.
ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 9 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ ఈజీగా ఛేజ్ చేసింది. దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. టాప్ ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్ 39 బంతుల్లో 54 రన్స్ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.
BHAI YEA SAB KYA HORA HAI YAHAN …#ipl #matchinterupp #crazyfan #mivsrr pic.twitter.com/SrAYGVNcBg
— SouL Mayavi (@soul_mayavi) April 1, 2024