వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో భారత సారధి రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనను ముందుండి నడిపించాల్సిన సమయంలో.. స్వీప్ షాట్ ఆడిన రోహిత్ వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికి 5 బంతుల్లో 11 పరుగులు చేసిన రోహిత్.. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు.
మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడుతూ.. ట్రీట్మెంట్ తర్వాత అంత నొప్పి లేదని, నాలుగో మ్యాచ్ ఆడేందుకు మధ్యలో గ్యాప్ ఉన్నందున, అప్పటికి తను కోలుకుంటాననే అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత కీలకమైన ఆసియా కప్ ఉండటంతో రోహిత్ కోలుకున్నా.. జట్టు యాజమాన్యం అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్లో నాలుగో మ్యాచ్ శనివారం నాడు జరుగుతుంది.