Rohit Sharma Praises Debutant | న్యూజిల్యాండ్తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత రోహిత్ శర్మ.. భారత యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతనెవరో కాదు ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్. ఈ సిరీస్లోని మూడు మ్యాచుల్లో ఆడిన అయ్యర్.. మొత్తమ్మీద 36 పరుగులు చేశాడు.
ముఖ్యంగా కోల్కతాలో జరిగిన మూడో మ్యాచ్లో టపటపా వికెట్లు కోల్పోయి భారత జట్టు ఇబ్బందుల్లో పడినప్పుడు ఆ ఒత్తిడి నుంచి జట్టు కోలుకోవడానికి సహకరించాడు.
ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ గురించి మాట్లాడిన రోహిత్ శర్మ (Rohit Sharma).. ‘ఈ సిరీస్లో జట్టుకు లభించిన మెరుగైన అంశాల్లో వెంకటేశ్ అయ్యర్ ఒకడు. అతను తన ఫ్రాంచైజీకి టాపార్డర్లో ఆడతాడు. కానీ ఇక్కడ అది కష్టం. అందుకే జట్టులో అతనికి వేరే పాత్ర ఇవ్వాలనుకున్నాం. ఆ స్థానంలో అతను ఆడగలడా? అని చూశాం. కోల్కతాలో క్రీజులో ఉన్నంతసేపూ అతను చాలా నిబద్ధతతో ఆడాడు. చాలా స్పష్టంగా తాను చేయాలనుకున్నది చేశాడు. అతని బౌలింగ్ నైపుణ్యం కూడా చూశాం. జట్టులో అతనొక మెరుగైన అంశం’ అని కొనియాడాడు.
వెంకటేశ్ వద్ద స్కిల్స్ ఉన్నాయని, కాన్ఫిడెన్స్ ఇస్తే చాలని టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. వెంకటేశ్ ఆడింది మూడు మ్యాచులేనని, గొప్పగా ప్రభావం చూపే అవకాశం అతనికి దక్కలేదని రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు.
కానీ భవిష్యత్తులో అతనిపై కచ్చితంగా జట్టు ఓ కన్నేసి ఉంచుతుందని పెడతామన్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ 20 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ కూడా తీసిన సంగతి తెలిసిందే.