ముంబై: రోహిత్ శర్మ(Rohit Sharma) తన లాంబోర్గి కారులో అతి వేగంగా డ్రైవ్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని తన ఇంటి నుంచి పుణెలో స్టేడియం వద్ద ఉన్న తన టీమ్ను కలిసేందుకు వెళ్లిన రోహిత్ అతి వేగంగా కారును డ్రైవ్ చేశాడు. అయితే అతను రెండుసార్లు స్పీడ్ లిమిట్ను దాటినట్లు ట్రాఫిక్ పోలీసులు ఛలాన్ వేశారు. పుణె-ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై రోహిత్ కారు రెండు సార్లు స్పీడ్ లిమిట్ దాటింది. ఓ సారి 105 కిలోమీటర్ల వేగంతో, మరో సారి 117 కిలోమీటర్ల వేగంతో అతనికి కారు ప్రయాణించింది. అయితే ఫైన్ కింద నాలుగు వేలు రోహిత్ కట్టేశాడు. ఒక సారి ఫైన్ కింద రెండు వేల ఛలాన్ వేశారు. అక్టోబర్ 17వ తేదీన అతను అతి వేగంగా కారును నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూల్ ప్రకారం అతనికి జరిమానా వేసినట్లు ట్రాఫిక్ అధికారులు చెప్పారు. రోహిత్ ఆ జరిమానా చెల్లించినట్లు హైవే పోలీసులు వెల్లడించారు. రోహిత్ తన కారుతో గంటకు 215 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తొలుత కొన్ని రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.