టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మంచి టచ్లో కనిపించాడు. కాన్ఫిడెన్స్తో షాట్లు ఆడుతూ పూర్తి నియంత్రణతో ఆడాడు.
అతని ఆటతీరు చూసిన అభిమానులు 100వ టెస్టులో సెంచరీ చేసేస్తాడని అనుకున్నారు. కానీ 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్లో బ్యాక్ ఫుట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. బంతి స్పిన్ అవుతుందని ఊహించకపోవడంతో వికెట్ కోల్పోయాడు. కోహ్లీ అవుటవడంతో అభిమానులే కాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా బాధ పడ్డాడు.
కోహ్లీ అవుటవగానే రోహిత్ తల పట్టుకొని ఇచ్చిన రియాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వారిద్దరి మధ్య స్నేహానికి ఈ రియాక్షనే నిదర్శనమని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్లో విహారితో కలిసి మూడో వికెట్కు 90 పరుగులు జతచేసిన తర్వాత కోహ్లీ అవుటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్గా నిలిచాడు.
ఆ తర్వాత కాసేపటికే విహారి కూడా పెవిలియన్ చేరాడు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (96) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా (45 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్కు సెంచరీ భాగస్వామయ్యం నెలకొల్పాడు. కానీ తన సెంచరీకి మాత్రం ఒక బౌండరీ దూరంలో అవుటయ్యాడు.
Bhai ko out kar diya? pic.twitter.com/dGqHF5YXOG
— Benaam Baadshah (@BenaamBaadshah4) March 4, 2022