ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ కీలక సూచన చేశాడు. రోహిత్ మంచి బంతులను కూడా బౌండరీలకు తరలించే ప్రయత్నంలో ఔటయి పోతున్నాడని, అలా కాకుండా మంచి బంతులను వదిలేయాలని సెహ్వాగ్ సూచించాడు.
ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని తాపత్రయపడకుండా మంచి బంతులను గౌరవిస్తూ, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తే రోహిత్ ఆటతీరు మెరుగుపడుతుందని సెహ్వాగ్ సూచించాడు. రోహిత్ బ్యాటింగ్ చేసేటప్పుడు సహనం పాటించాలన్నాడు సెహ్వాగ్. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు.