ఢిల్లీ: డ్రెస్సింగ్రూమ్లో ఈ-సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్కు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో కోతతో సరిపెట్టింది. ఈనెల 28న ముల్లాన్పూర్లో పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా అతడు ధూమపానం చేసినట్టు వీడియోలు వైరల్ కాగా విచారణలో రాయల్స్ కెప్టెన్ తప్పు ఒప్పుకోవడంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది.
అతడిది లెవల్ 1 అఫెన్స్ కింద పరిగణిస్తూ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే గాక ఒక డీమెరిట్ పాయింట్నూ అందజేసింది. ఈ-సిగరెట్స్ వాడకంపై భారత్లో నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో అతడిపై తీవ్ర చర్యలుంటాయని వార్తలొచ్చినా బీసీసీఐ మాత్రం ఫైన్తో సరిపెట్టడం గమనార్హం.