హైదరాబాద్, ఆట ప్రతినిధి: వినూ మన్కడ్ అండర్-19 ట్రోఫీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఎలైట్ గ్రూపు-సిలో భాగంగా శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ 8 వికెట్లకు 283 పరుగులు చేసింది. కార్తీక్రెడ్డి(82), కెప్టెన్ తిలక్వర్మ(59), శశాంక్ లోకేశ్(59) అర్ధసెంచరీలతో అదరగొట్టగా, రిశీత్రెడ్డి (31) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గోవా..రితీశ్రెడ్డి(6/34) ధాటికి 45.3 ఓవర్లలో 202 పరుగులకు కుప్పకూలింది. రితీశ్ విజృంభణతో గోవా బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. తన అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో ఈ యువ బౌలర్ సఫలమయ్యాడు. కుశాల్ (70), అయూష్ (71) మినహా అందరూ విఫలమయ్యారు.