హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్లో రిషిత రెండు స్వర్ణాలు కైవసం చేసుకుంది. జూనియర్ టీ46 కేటగిరీలో పోటీ పడిన రిషిత 100 మీటర్ల పరుగులో పసిడి చేజిక్కించుకుంది.
అనంతరం 400 మీటర్ల రేసులోనూ రిషిత అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం ఖాతాలో వేసుకుంది. జాతీయ స్థాయిలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన రిషితను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.