డెహ్రాడూన్: క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక పంత్ బ్రెయిన్, వెన్నుముక ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ముఖంపై తగిలిన దెబ్బలకు, వెన్నులో చర్మం కొట్టుకుపోయిన దగ్గర పంత్కు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఓ రిపోర్ట్లో తేలింది. ఇవాళ మడిమతో పాటు మోకాలికి ఎంఆర్ఐ తీయనున్నారు. మోకాలి, మడిమ వద్ద వాపు వస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఎంఆర్ఐ తీయనున్నారు.