సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు వైట్ వాష్ ఎదుర్కొంది. మూడో వన్డేలో కొంత పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ దిగ్గజ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు.
‘‘కత్తి పట్టిన వాడి కథ కత్తితోనే ముగుస్తుంది. పంత్ ఇప్పుడు ఎలా ఆడుతున్నాడో అదే ఆటను కంటిన్యూ చేస్తాడు’’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. పంత్ ఏమీ కోహ్లీ కాదని, అతను నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించుకోలేడని అన్నాడు. ‘అతను కోహ్లీ వంటి వాడు కాదు. కోహ్లీలా నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం అతని వల్ల కాదు’ అని వివరించాడు.
పంత్ పదునైన శక్తిగా మారాలంటే కొంత సమయం పడుతుందని గంభీర్ చెప్పాడు. కాగా, సఫారీ గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. తొలి రెండు మ్యాచుల్లో కనీసం పోటీ ఇవ్వడానికి తంటాలు పడిన టీమిండియా.. మూడో వన్డేలో కొంత రాణించినప్పటికీ వైట్ వాష్ మాత్రం తప్పించుకోలేక పోయింది. చివరి మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.