న్యూఢిల్లీ: వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant).. ఐపీఎల్ 2024 కోసం రెఢీ అవుతున్నాడు. ఫిట్నెస్ కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జిమ్లో గంటలు గంటలు ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. జిమ్ సెషన్కు చెందిన ఓ వీడియోను తన ఇన్స్టాలో పోస్టు చేశాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.
2022 డిసెంబర్ నుంచి రిషబ్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఆ ఏడాది డిసెంబర్ 30వ తేదీన రిషబ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో అతను కసరత్తులు చేస్తున్నాడు.
కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నాడు. పూర్తి స్థాయిలో అతను రికవరీ అయ్యాడు. అయితే ఐపీఎల్ 2024కు రిషబ్ పంత్ ఫిట్గా ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రిక్కీ పాంటింగ్ తెలిపాడు. ఐపీఎల్లో పంత్ అన్ని మ్యాచ్లు ఆడుతాడన్న నమ్మకం ఉందని రిక్కీ చెప్పాడు.