భారత్ వికెట్లను ఏమాత్రం కాపాడుకోలేకపోతోంది. మొదటి నుంచి వికెట్లను నష్టపోతూ.. స్వల్ప స్కోర్ను చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 14.3 ఓవర్లు ఆడిన భారత్.. కేవలం 70 పరుగులు మాత్రమే చేసింది. 5 వికెట్లను నష్టపోయింది. మిల్నే బౌలింగ్లో రిషబ్ పంత్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. 19 బంతుల్లో పంత్.. 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజుల్లో పాండ్యా, జడేజా ఉన్నారు.