కార్డిఫ్ : ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ చివరి సన్నాహకంలో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. బుధవారం జరిగిన ఆఖరి వామప్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రిచా ఘోష్(68) అర్ధసెంచరీ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
లిన్సె స్మిత్ (3/42) మూడు వికెట్లతో రాణించింది. తొలుత అమీ జోన్స్(64), కెప్టెన్ నాట్ సివర్(57) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. శ్రేయాంకా పాటిల్(2/29) రెండు వికెట్లతో ఆకట్టుకోగా, షెఫాలీ, రేణుకాసింగ్, శ్రీచరణి, రాధాయాదవ్ ఒక్కో వికెట్ తీశారు. మెగాటోర్నీలో ఈనెల 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది.