గ్వాలియర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రెస్టాఫ్ ఇండియా జట్టు.. ఇరానీ కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన పోరులో రెస్టాఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 484 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్ 294 రన్స్కు ఆలౌటైంది. రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసి.. మధ్యప్రదేశ్ ముందు 437 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో మధ్యప్రదేశ్ 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (213)తో పాటు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (144) చేసిన రెస్టాఫ్ ఇండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.