రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు.. సన్రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 68 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47) అద్భుతంగా ఆడటంతో సన్రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలిచింది.
అతనితోపాటు ఓపెనింగ్ చేసిన విలియమ్సన్ (16 నాటౌట్) యాంకర్ రోల్ పోషించగా.. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ (7 నాటౌట్) సిక్సర్తో మ్యాచ్ ముగించాడు. దీంతో 8 ఓవర్లలోనే 72 పరుగులు చేసి విజయాన్ని మూటకట్టుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ రెండో స్థానానికి చేరింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.