రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పోరాడింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ (56 నాటౌట్) చెలరేగడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (8), దేవదత్ పడిక్కల్ (7) పూర్తిగా నిరాశ పరిచారు.
తర్వాత వచ్చిన అశ్విన్ (17), సంజూ శాంసన్ (27), డారియల్ మిచెల్ (16), ఫర్వాలేదనిపించారు. రియాన్ పరాగ్ అర్ధశతకంతో అజేయంగా నిలువగా.. భారీ అంచనాలు పెట్టుకున్న షిమ్రాన్ హెట్మెయర్ (3) విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ (5), ప్రసిద్ధ్ కృష్ణ (2) పరుగులు చేశారు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బెంగళూరు బౌలర్లకు.. చివరి ఓవర్లలో ఫీల్డర్ల నుంచి మద్దతు కరువైంది.
హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ ఇచ్చిన సులభమైన క్యాచ్ను కీపర్ దినేష్ కార్తీక్ జారవిడిచాడు. ఆ మరుసటి ఓవర్లో హాజిల్వుడ్ బౌలింగ్లో పరాగ్ కొట్టిన బంతి గాల్లోకి ఎత్తుగా లేచింది. అయితే దాన్ని హసరంగ జారవిడిచాడు. ఇలా బతికిపోయిన పరాగ్ ఆ తర్వాత.. 8 బంతుల్లో 21 పరుగులు పిండుకున్నాడు.
దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హాజిల్వుడ్, హసరంగ, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Riyan Parag finishes the @rajasthanroyals innings in style.
Brings up his second IPL FIFTY.
Live – https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/8xLdMyTKaQ
— IndianPremierLeague (@IPL) April 26, 2022