ఓపెనర్ అవతారం ఎత్తినా కూడా కోహ్లీ రాత మారలేదు. తొలి ఓవర్లోనే మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. 9 పరుగులు చేశాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో షార్ట్ బాల్కు బలయ్యాడు. ప్రసిద్ధ్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది.
దాన్ని పరాగ్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరీ అందుకోవడంతో కోహ్లీ వెనుతిరిగాడు. ఆ బంతి బ్యాట్ను మిస్ అయ్యి హెల్మెట్కు తగిలిందేమో? అనిపించింది. కానీ కోహ్లీ మైదానం వీడటంతో అది బ్యాట్కే తగిలినట్లేనని అభిమానులు అనుకున్నారు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో 10 పరుగుల వద్ద బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది.