బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్స్టో (23 బంతుల్లో 60 నాటౌట్), శిఖర్ ధవన్ (21) జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బెయిర్స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే మ్యాక్స్వెల్ బౌలింగ్లో ధవన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
హసరంగ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి అవుటయ్యాడు. హసరంగ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి రాజపక్స ప్రయత్నించాడు. అయితే హర్షల్ పటేల్ చక్కని క్యాచ్ అందుకోవడంతో రాజపక్స మైదానం వీడాల్సి వచ్చింది.