బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (19) మరోసారి తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మార్చలేక తంటాలు పడుతున్న మయాంక్.. ఈ మ్యాచ్లో కూడా అదే సమస్యతో పెవిలియన్ చేరాడు.
హర్షల్ పటేల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన మయాంక్.. అదే ఓవర్ చివరి బంతిని కట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే షాట్ మధ్యలోనే దాన్ని ఆపేసి ర్యాంప్ చేయడానికి ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో నేరుగా థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న హసరంగకు వెళ్లింది. అతను ఎటువంటి పొరపాటూ చేయకుండా క్యాచ్ అందుకోవడంతో మయాంక్ పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.