బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంతితో సత్తా చాటుతోంది. తాము ఓటమిని అంగీకరించలేదని, పోరాడుతున్నామని తెలిసేలా చేసింది. తొలి ఓవర్లోనే ఉమేష్ యాదవ్ వికెట్ దక్కించుకున్నాడు. యువ ఆటగాడు అనూజ్ రావత్ (0)ను పెవిలియన్ చేర్చాడు.
ఉమేష్ వేసిన బంతిని వదిలేయాలో? లేక ఆడాలో తెలియని డైలమాలో పడిపోయాడు రావత్. ఈ క్రమంలోనే ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ షెల్డన్ జాక్సన్ సులభంగా అందుకున్నాడు. దాంతో ఖాతా తెరవకుండానే అతను పెవిలియన్ చేరాల్చి వచ్చింది. రావత్ అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.