బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (9) పెవిలియన్ చేరాడు. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని రహానే పుల్ చేయడానికి ప్రయత్నించాడు. డీప్ బాక్వర్డ్ స్క్వేర్లో ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ వైపు బంతి దూసుకెళ్లింది. దాన్ని అతను అందుకోవడంతో రహానే ఇన్నింగ్స్ ముగిసింది.
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో రహానే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే బెంగళూరుపై మాత్రం అదే మ్యాజిక్ చేయలేకపోయాడు. రహానే అవుటవడంతో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా (10) బౌండరీలతో తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. దాంతో శ్రేయాస్, రాణా కలిసి ఇన్నింగ్స్ నిలబెడతారని అభిమానులు ఆశించారు.
కానీ ఆకాష్ దీప్ మరోసారి బ్యాటర్ను బోల్తా కొట్టించాడు. టాప్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బంతిని అద్భుతంగా డైవ్ చేసి డేవిడ్ విల్లీ అందుకున్నాడు. దాంతో తొలి పవర్ప్లే ముగిసే సరికి కేకేఆర్ జట్టు 43/3 స్కోరుతో కష్టాల్లో నిలిచింది.