గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు శుభారంభం అందించారు. కోహ్లీ మంచి టచ్లో కనిపించగా.. డుప్లెసిస్ అతనికి మంచి సహకారం అందించాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 55 పరుగులు చేసింది.