చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ చివర్లో కుప్పకూలింది. ఆరంభంలో డుప్లెసిస్ (38), కోహ్లీ (30) మంచి ఆరంభమే అందించారు. అయితే ఆ తర్వాత మ్యాక్స్వెల్, డుప్లెసిస్, కోహ్లీ ముగ్గురూ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో పటీదార్ (21), లోమ్రోర్ (42) జట్టును ఆదుకున్నారు.
వీళ్లు కూడా అవుటైన తర్వాత దినేష్ కార్తీక్ (26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అయితే హసరంగ (0), షాబాజ్ అహ్మద్ (1) నిరాశ పరిచారు. హర్షల్ పటేల్ (0) చివరి ఓవర్ ఐదో బంతిని రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ 3, మొయీన్ అలీ 2 వికెట్లు తీయగా.. డ్వెయిన్ ప్రిటోరియస్ ఒక వికెట్తో సత్తా చాటాడు.