బెంగుళూరు: విరాట్ కోహ్లీ(Virat Kohli)కి భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 24 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్లో ఆదివారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో .. బెంగుళూరు జట్టుకు కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్గా చేశాడు. అయితే ఆ ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. కానీ చాలా నెమ్మెదిగా ఆ జట్టు బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు కోహ్లీకి 24 లక్షల జరిమానా వేశారు.
కెప్టెన్తో పాటు జట్టు సభ్యులు కూడా ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆ జరిమానాను ఖరారు చేశారు. ప్రతి ప్లేయర్కు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం వసూల్ చేయనున్నారు. కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో ఆర్సీబీ జట్టు ఓవర్లు నెమ్మదిగా వేయడం ఇది రెండోసారి. దీంతో అతనికి 24 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.