అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం మైదానంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నది. రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించగానే.. CSK అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. చెన్నై టీమ్ మేట్స్, ఇతర సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబసభ్యులు కుటుంబసభ్యులు మైదానంలో కి పరుగెత్తుకొచ్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా మైదానంలోకి పరుగెత్తుకొచ్చింది. నేరుగా భర్త దగ్గరికి వెళ్లి అతని కాళ్లు మొక్కింది. ఆ తర్వాత ఆనందంతో జడేజాను బిగ్గరగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మరెందుకు ఆలస్యం ఈ కింది వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Ravindra Jadeja’s wife touched Jadeja’s feet after the victory last night.#MSDhoni𓃵 #CSKvsGT #IPL2023Final pic.twitter.com/nNp6RAWUhR
— Bhadohi Wallah (@Mithileshdhar) May 30, 2023
CSK 💛 ko champion 🏆 banane wale Sir ravindra jadeja with his wife #IPL2023Finals #RavindraJadeja pic.twitter.com/MPVgaAPh5c
— Keshav Nagar (@keshavnagarncc) May 29, 2023
కాగా, రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా రాజ పుత్రిక. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కూడా ఆమె ఆకుపచ్చరంగు సంప్రదాయ చీర ధరించి వచ్చారు. అంతేగాక గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా జామ్నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.