Ratan Tata: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇటీవలే పాకిస్తాన్ను అఫ్గానిస్తాన్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్ల నగదు బహుమానం ప్రకటించారంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రషీద్ ఖాన్ భారత జెండాను పట్టుకున్నందుకు గాను రతన్ టాటా అతడికి రూ. 10 కోట్ల నజరానా అందజేసినట్టు న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై స్వయంగా రతన్ టాటా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
‘నేను ఏ క్రికెట్ ఫ్యాకల్టీకి గానీ ఏ ఆటగాడికి గానీ జరిమానా విధించమని లేదా రివార్డు ప్రకటించాలని ఐసీసీకి ఎలాంటి సూచన చేయలేదు. నాకు క్రికెట్తో ఎటువంటి సంబంధం లేదు. నా అధికారిక ఖాతాల నుంచి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వర్డ్స్ను, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దు..’ అని ఆయన పేర్కొన్నారు.
I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players.
I have no connection to cricket whatsoever
Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official…
— Ratan N. Tata (@RNTata2000) October 30, 2023
కాగా పాకిస్తాన్ – అఫ్గానిస్తాన్ మధ్య ఈనెల 23న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్లో అఫ్గాన్.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ పది ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అనంతరం అఫ్గానిస్తాన్.. 49 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 286 పరుగులు చేసింది.