హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో శనివారం జరిగిన సమావేశంలో శ్రీధర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నెల 23న నిర్వహిచనున్న ఒలింపిక్ రన్ కోసం ఘనం గా ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, జగదీశ్ యాదవ్, మహేశ్వర్, ప్రేమ్రాజ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.