Ranji Trophy 2024 | దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీట్రోఫీ సెమీఫైనల్ స్టేజ్లో భాగంగా తమిళనాడు – ముంబై మధ్య జరుగుతున్న రెండో సెమీస్లో ముంబై జట్టుకు తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కింది. చివరి వరుస బ్యాటర్లు అయిన శార్దూల్ ఠాకూర్ (104 బంతుల్లో 109, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి తోడు పదో నెంబర్ ఆటగాడు తనుష్ కొటియాన్ (109 బంతుల్లో 74 నాటౌట్, 10 ఫోర్లు) చెలరేగడంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబైకి ఇప్పటికే 207 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై.. వంద ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. తనుష్ తో పాటు క్వార్టర్ ఫైనల్లో సెంచరీ చేసిన తుషార్ దేశ్పాండే (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
తమిళనాడును ఫస్ట్ ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై ఆ తర్వాత బ్యాటింగ్లో తడబడింది. తమిళనాడు సారథి సాయి కిషోర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో ముంబై 107 రన్స్కే 6 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన శార్దూల్.. హార్ధిక్ తమోర్ (35), తనుష్ల అండతో ముంబైని పటిష్టస్థితిలో నిలిపాడు. 88 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసిన శార్దూల్.. కుల్దీప్ సేన్ బౌలింగ్లో నిష్క్రమించినా తుషార్ తమిళ బౌలర్లకు తలనొప్పిగా మారాడు. క్వార్టర్స్లో తుషార్తో పాటు తనుష్లు కూడా సెంచరీలతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Stumps on Day 2!
Mumbai move to 353/9
Sensational 💯 from Shardul Thakur, fifties from Musheer Khan (55) & Tanush Kotian (74*) have helped Mumbai extend the lead to 207
6⃣ wickets for Sai Kishore@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN
Scorecard ▶️ https://t.co/9tosMLk9TT pic.twitter.com/ZHU8lBSGqg
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2024
కష్టాల్లో విదర్భ..
మధ్యప్రదేశ్ – విదర్భ మధ్య జరుగుతున్న తొలి సెమీస్ కూడా రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో విదర్భ 170 పరుగులకే ఆలౌట్ అవగా మధ్యప్రదేశ్.. 252 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 13 పరుగులు చేసింది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్లోనూ విదర్భకు తొలి షాకిచ్చాడు. విదర్భ ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉంది.
Vidarbha move to 13/1 at stumps on Day 2, after bowling out Madhya Pradesh for 252.
Himanshu Mantri’s superb 126 helped the visitors take an 82-run lead.@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1
Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/4aN19Etl8f
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2024