కాటారం, మార్చి 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్-13 విభాగంలో అత్యధిక పాయింట్లు సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన అనయ ఈ క్రమంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 26 నుంచి విజయవాడలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున అనయ ప్రాతినిధ్యం వహించనుంది.