తెలంగాణ చౌక్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టమటం రామానుజమ్మ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించింది. మలేషియాలోని కౌలాలంపూర్లో ఈ నెల 16 నుంచి 18 వరకు 35వ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరుగగా, 100, 200, 400, 800మీటర్ల విభాగాల్లో రామానుజమ్మ పోటీకి దిగింది.
200 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించింది. 70ఏండ్లు ఉన్న రామానుజమ్మ రజతం సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు.