IPL-2021 | చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ఫ్లేఆఫ్అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్లలో యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే రాణించారు. యశస్వి జైశ్వాల్ 50 పరుగులు చేయగా, శివమ్ దూబే 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేశాడు.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ టాస్ కోల్పోవడం బాడ్లక్ అని అభిప్రాయ పడ్డారు. 190 పరుగులు మంచి స్కోరని పేర్కొన్నాడు. అయితే, తమపై బౌలర్లు వత్తిడి పెంచారని, తాము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారని వ్యాఖ్యానించాడు.