న్యూఢిల్లీ: రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్లేయర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్జెయింట్స్ తమ ప్లేయర్లను పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి దేవదత్ పడిక్కల్ లక్నోకు..మరోవైపు లక్నో స్పీడ్స్టర్ అవేశ్ఖాన్..రాజస్థాన్కు మారారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న యువ పేసర్ అవేశ్ఖాన్..ఇప్పటి వరకు ఐపీఎల్లో 47 మ్యాచ్ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో అవేశ్ను లక్నో ఫ్రాంజైజీ రూ.10 కోట్లకు తీసుకుంది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్..57 మ్యాచ్ల్లో 1521 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఫామ్లేమితో సతమతమవుతున్న సర్ఫరాజ్ఖాన్, మనీశ్పాండేను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది.