ఐపీఎల్ 14 సీజన్లో భాగంగా.. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. దీంతో.. పంజాబ్ 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కోసం బ్యాటింగ్కు దిగనుంది.
రాజస్థాన్ను యశస్వి జైశ్వాల్, లోమ్రోర్ ఆదుకున్నారు. జైశ్వాల్ 36 బంతుల్లో 49 పరుగులు చేసి.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహిపాల్ లోమ్రోర్.. 17 బంతుల్లో 43 పరుగులు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఇక.. చివరి బంతిలో అర్ష్దీప్ వేసి వేసిన బంతికి త్యాగీ ఔట్ అయిపోవడంతో.. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆల్ఔట్ అయి 185 పరుగులు చేసింది.
రాజస్థాన్ ఇతర ఆటగాళ్లు… లెవిస్ 21 బంతుల్లో 36 పరుగులు చేసి అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. లివింగ్స్టన్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి అల్లెన్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్.. 5 వికెట్లు తీశాడు. షమీ 3 వికెట్లు, బ్రార్ ఒక వికెట్, ఇషాన్ పొరెల్ ఒక వికెట్ తీశారు.