IPL 2023 : సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ గర్జించింది. వరుస ఓటములకు గుడ్ బై చెప్పి టేబుల్ టాపర్గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్పై రెండో విజయం నమోదు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) హాఫ్ సెంచరీకి తోడు, ధ్రువ్ జురెల్(34), దేవ్దత్ పడిక్కల్(27) విధ్వంసంతో సంజూ సేన రెండొందలు కొట్టింది. ఆ తర్వాత బలర్లు చెలరేగడంతో చెన్నైని కట్టడి చేసింది. శివం దూబే(52), మోయిన్ అలీ(23) దంచినా సరిపోలేదు. దాంతో, ధోనీ సేన హ్యాట్రిక్ విజయ యాత్రకు బ్రేక్ పడింది.
కుల్దీప్ వేసిన 20వ ఓవర్లలో చెన్నై విజయానికి 37 రన్స్ కావాలి. ఆఖరి బంతికి శివం దూబే(52) ఔటయ్యాడు. దాంతో, రాజస్థాన్ 32 పరుగుల తేడాతో గెలిచింది. రవీంద్ర జడేజా(21) నాటౌట్గా నిలిచాడు.
భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో చెన్నై తొలి వికెట్ పడింది. ఆడం జంపా తన మొదటి ఓవర్లలోనే డేంజరస్ డెవాన్ కాన్వే(8)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత.. రుతురాజ్ గైక్వాడ్(47)ను పెవిలియన్ పంపాడు. అశ్విన్ ఒకే ఓవర్లో అజింక్యా రహానే(15), ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అంబటి రాయుడు(0)ను ఔట్ చేశాడు. దాంతో, 73 రన్స్కే చెన్నై కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. శివం దూబే(), మోయిన్ అలీ(23) ధనాధన్ ఆడారు. ఐదో వికెట్కు 50 రన్స్ జోడించారు.
సొంత మైదానంలో రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్లో మూడో అర్థ సెంచరీ సాధించాడు. యశస్వీ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 50 రన్స్ చేశాడు. జోస్ బట్లర్(27) మరోసారి విఫలమయ్యాడు. తుషార్ దేశ్పాండే ఒకే ఓవర్లో సంజూ శాంసన్(17), యశస్వీని ఔట్ చేసి రాజస్థాన్ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వచ్చిన హెట్మెయిర్(8) కూడా తక్కువకే ఔటయ్యాడు. అయితే.. ఆరోస్థానంలో వచ్చిన దేవ్దత్ పడిక్కల్(27), ధ్రువ్ జురెల్(34) ధనాధన్ ఆడడంతో గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ స్టేడియంలో రెండొందల స్కోర్ కొట్టడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.