హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏడు పదుల వయసులోనూ యువతకు దీటుగా.. పోటీల్లో పాల్గొని సత్తచాటుతున్న మర్రి లక్ష్మణ్ రెడ్డి అందరికీ ఆదర్శనీయులని ఎమ్ఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని లోనోవాలాలో ఆదివారం జరిగిన 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న 77 ఏండ్ల మర్రి లక్ష్మణ్ రెడ్డి విజయవంతంగా రేసు పూర్తిచేశారు. కుర్రాళ్లకు పోటీనిస్తూ.. అలుపెరగకుండా రేసును పూర్తి చేయడం విశేషం.