IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫైనల్ పోరు సోమవారానికి (Reserve Day మే29) వాయిదా పడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుణుడు శాంతిస్తాడేమోనని అంతా ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. దాదాపు నాలుగు గంటలకు పైగా వర్షం కురుస్తూనే ఉండడంతో స్టేడియం చిన్నపాటి చెరువును తలపించింది. వాన తగ్గకపోవడంతో మ్యాచ్ను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది.
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. అయితే.. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పేశారు. ఎంత సేపు చూసినా వాన తగ్గకపోవడంతో అంపైర్లు రిజర్వ్ డేన ఫైనల్ నిర్వహించానలే నిర్ణయానికి వచ్చారు. దాంతో, రేపు రాత్రి 7ః30 గంటలకు ఇదే స్టేడియంలో టైటిల్ పోరు జరగనుంది.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
వర్షం ఒకవేళ తగ్గితే 9ః45కి 19 ఓవర్లు, 10 గంటలకు అయితే 17 ఓవర్లు, 10ః30 గంటలకు వీలైతే 15 ఓవర్ల ఆటకు వీలయ్యేది. అదీ సాధ్యం కాకుంటే కనీసం 5 ఓవర్లు లేదా సూపర్ ఓవర్ అయినా ఆడించాలని అంపైర్లు చూశారు. ఒక్క బంతి కూడా పడేందుకు చాన్స్ లేకపోవడంతో రిజర్వ్ డేన అంటే.. రేపు ఫైనల్ నిర్వహిస్తారు. రేపు కూడా వర్షం కురిసిందంటే మాత్రం పాయింట్లను చూస్తారు. 10 విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటిస్తారు. దాంతో, రెండో స్థానంలో ఉన్న సీఎస్కే రన్నరప్తో సరిపెట్టుకుంటుంది.