IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సొంతగడ్డపై చెలరేగిన మర్క్రం సేన 8 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. రాహుల్ త్రిపాఠి అర్థ శతకం బాదడంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. దాంతో, వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న పంజాబ్కు నిరాశే మిగిలింది.
సొంత గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట పంజాబ్ కింగ్స్ను 143 రన్స్కే కట్టడి చేసింది. అయతే.. స్వల్ప లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు హ్యారీ బ్రూక్(13), మయాంక్ అగర్వాల్ (21) తక్కువకే వెనుదిరిగారు. దాంతో, మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(74) బాధ్యతగా ఆడాడు. కెప్టెన్ మర్క్రం (37)తో కలిసి మూడో వికెట్కు 100 రన్స్ జోడించాడు. వీళ్లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
Fifty partnership up between @AidzMarkram & Rahul Tripathi!@SunRisers need 26 off the final five now ✅
Follow the match ▶️ https://t.co/Di3djWhVcZ#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/E3Qy9CfTfq
— IndianPremierLeague (@IPL) April 9, 2023
కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 143 పరుగులు చేయగలిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ధావన్ ఒంటరి పోరాటం చేశాడు. సామ్ కరన్(22), శిఖర్ ధావన్ (33) నాలుగో వికెట్కు 41 రన్స్ జోడించారు. సికిందర్ రజా(5), షారుక్ ఖాన్(4) విఫలమయ్యారు. 88 పరుగులకే 9 వికెట్లు పడిన పంజాబ్ 143 రన్స్ చేసిందంటే అదంతా ధావన్ చలవే. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్లో సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడిన అతను స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్కు 55 రన్స్ జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్కు ఒక వికెట్ దక్కింది.