టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ ఎవరనే ప్రశ్నకు అధికారికంగా తెరపడింది. భారత జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ తర్వాత ప్రస్తుతం టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత న్యూజిల్యాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే ద్రవిడ్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు.