Rahul Dravid : ప్రపంచంలోని మేటి జట్లలో భారత్(Team India) ఒకటి. అందులో సందేహమే లేదు. కానీ, గత కొంతకాలంగా ఐసీసీ ట్రోఫీ(ICC Finals) ఫైనల్లో మన జట్టు ఆట అంతంత మాత్రంగానే ఉంటోంది. నిన్నరాత్రి వెస్టిండీస్ జరిగిన ఐదో టీ20లో బ్యాటర్లు విఫలం కావడంతో ట్రోఫీ చేజారింది. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఈ సమస్యపై స్పందించాడు. లోయర్ ఆర్డర్(Lower Order)లో బ్యాటింగ్ సమస్య టీమిండియాను వేధిస్తోందని అన్నాడు. మేటి జట్లతో పోల్చితే మన టీమ్ ఆ విషయంలో వెనకబడి ఉందని ద్రవిడ్ అంగీకరించాడు.
‘లోయర్ ఆర్డర్లో బలమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం నిజమే. వెస్టిండీస్ను చూడండి. 11వ స్థానంలో వచ్చే అల్జారీ జోసెఫ్(Alzarri Joseph) చక్కని బంతుల్నికూడా బాదగలడు. ప్రస్తుతం టీమిండియాకు అలాంటి ప్లేయర్లు కావాలి. అయితే.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు. అంతేకాదు విండీస్తో టీ20లకు ఎంపిక చేసిన బృందం కొంత తేడా ఉందని, అందువల్లే కొత్త కాంబినేషన్లు, మార్పులు చేయడం సాధ్యం కాలేదని ద్రవిడ్ చెప్పాడు.
భారత్పై 17 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన విండీస్
వెస్టిండీస్తో జరిగిన ఐదు టీ20ల్లో భారత లోయర్ ఆర్డర్కు ఎక్కువ అవకాశాలు రాలేదు. 8వ నంబర్లో వచ్చిన అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)కు ఐపీఎల్ స్ట్రైక్ రేటు 67.52 ఉంది. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)కు టీ20ల్లో 77.95, యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు 46.15 స్ట్రయిక్ రేటు ఉంది. అయితే.. వీళ్లకు ఈ సిరీస్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువ రాలేదు. టీ20ల వరకైతే ఓకేగానీ వన్డేల్లో మాత్రం వీళ్ల ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచిన విండీస్ 3-2తో సిరీస్ దక్కించుకుంది. దాంతో, భారత్పై 17 ఏళ్ల తర్వాత సిరీస్ అందుకుంది.