గంభీరావుపేట, జూన్ 10:రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ ప్రాంత పిల్లలను బడికి రప్పించడమే కాదు, చేనేత పరిశ్రమపై అవగాహన కల్పించే లక్ష్యంతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలపై చేనేత చిత్రాలు ప్రాణం పోసుకుంటున్నాయి. గివ్ తెలంగాణ, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తరగతి గది గోడలపై వేసిన కళాత్మక చిత్రాలు ప్రతి ఒక్కరికి కట్టిపడేస్తున్నాయి. –