IND vs RSA : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు(Team India) ఆలౌటయ్యింది. రబడ, ఎంగిడి ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. 11 బంతుల్లోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన 98 పరుగుల ఆధిక్యంలో ఉందంతే. తొలుత దక్షిణాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం రబడ, బర్గర్ దెబ్బకు కీలక వికెట్లు కోల్పోయింది.
భారత జట్టులో మాజీ సారథి విరాట్ కోహ్లీ(46) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్(8), జడేజా(0), బుమ్రా(0)లను వెనక్కి పంపి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. అనతంరం రబడా బౌలింగ్లో సిరాజ్ రనౌట్గా వెనుదిరగగా.. ప్రసిద్ కృష్ణ(0) క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా 153 పరుగులకే పరిమితమైంది.
WHAT. JUST. HAPPENED. 🤯
▶️ https://t.co/OUpdAVOGFW | #SAvIND pic.twitter.com/HN5qnCos6n
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2024
కేప్టౌన్లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బౌన్స్కు అనుకూలించిన పిచ్పై పేసర్ సిరాజ్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో నిప్పులు చెరిగిన సిరాజ్ 6 వికెట్లతో ఎల్గర్ సేనను హడలెత్తించాడు. బుమ్రా, ముకేశ్లు చెరో రెండు వికెట్లు తీయడంతో సఫారీ జట్టు 55 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ(39), యశస్వీ జైస్వాల్(0), శుభ్మన్ గిల్(36), శ్రేయస్ అయ్యర్(0), ).. స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు.