బాలి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన అనంతరం.. బరిలోకి దిగిన టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000లో సింధు మూడో సీడ్గా మైదానంలో అడుగుపెట్టనుండగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్ సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. గత వారం ముగిసిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750 సెమీఫైనల్లో ఓడిన ఈ ఇద్దరు ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించి విజేతలుగా నిలువాలని చూస్తున్నారు.