వంతా (ఫిన్లాండ్) : ఆసియా క్రీడల్లో విఫలమైన పీవీ సింధు ఆర్కిటిక్ ఓపెన్లో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్లో క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఎనిమిదో సీడ్ సింధు గురువారం 38 నిమిషాల్లోనే చైనీస్ తైపీకి చెందిన వెన్ చీ హ్సూను 21-11, 21-10తో మట్టికరిపించింది.
ఈ ఏడాది ఒక్క టోర్నీలోనూ కార్టర్స్ దాటని ఆమె ఈసారి ఆ గండాన్ని దాటి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, కిరణ్ జార్జ్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. జపాన్ ప్లేయర్ కంటా త్సునేయమ చేతిలో శ్రీకాంత్ 15-21, 12-21తో.. చైనా ఆటగాడు లూ ఝాంగ్ జూ చేతిలో జార్జ్ 10-21, 20-22తో ఓటమిపాలయ్యారు.