న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమైంది. 2017లో బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైన సింధు మరోసారి ఆ పదవికి పోటీ చేయనుంది. డిసెంబర్ 17న స్పెయిన్ వేదికగా ఈ కమిషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిలో సింధు కూడా ఉంది. సభ్యత్వం కోసం ఆడం హాల్ (స్కాట్లాండ్), హదియా హోస్నీ (ఈజిప్టు), ఇరిస్ వాంగ్ (అమెరికా), కిమ్ సోయెంగ్ (కొరియా), రాబిన్ తబ్లింగ్ (నెదర్లాండ్), సొరయ (ఇరాన్), జెంగ్ సి (చైనా) పోటీలో ఉన్నారు. ఎన్నికైన వారు బీడబ్ల్యూఎఫ్ మండలిలో సభ్యులుగా ఉంటారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులయ్యే వారిలో సింధు పేరు కూడా ఉంది.