బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముందంజ వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-10తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి షట్లర్ యునో లీ(జర్మనీ) రిటైర్డ్గా వెనుదిరిగింది.
దీంతో సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తదుపరి రౌండ్లో కొరియా షట్లర్ అన్ సె యంగ్తో తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-14, 13-21, 13-21తో సు లి యంగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడి నిష్క్రమించాడు.