న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో 15వ స్థానంలో నిలిచింది. నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడ ల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం గాయం కారణంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ తెలుగమ్మాయి.. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో మూడో స్థానాలు కోల్పోయి 15వ ర్యాంక్తో సరిపెట్టుకుంది.
పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 8వ స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున ఇదే అత్యుత్తమం కాగా.. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 19వ, 20వ ర్యాంక్లు దక్కించుకున్నారు.