ఇండోనేషియా ఓపెన్లో ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు (PV Sindhu).. సెమీస్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు సెమీస్కు అర్హత సాధించింది. సౌత్ కొరియాకు చెందిన సిమ్ యుజీన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు గెలిచింది. యుజీన్పై 14-21, 21-19, 21-14తో విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న సింధు.. రెండో ర్యాంక్లో ఉన్న రాచనోక్ ఇంటానన్ను సెమీస్లో ఎదుర్కొంటుంది.
థాయ్ల్యాండ్కు చెందిన ఇంటానన్పై గెలిస్తే ఫైనల్ చేరుతుంది. క్వార్టర్ ఫైనల్లో ఒక గంట ఆరు నిమిషాల పోరాటం తర్వాత సింధు విజయం సాధించింది. కాగా, క్వార్టర్ ఫైనల్ చేరిన భారత షట్లర్ సాయి ప్రణీత్.. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సెన్తో తలపడనున్నాడు.